Breaking News

24/08/2019

నిర్భయంగా, నిజాయతీగా సేవ చేయండి..

హైద్రాబాద్, ఆగస్టు 24  (way2newstv.in - Swamy Naidu)
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం నెరవేరిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. స్వదేశీ సంస్థానాలను విలీనం చేసిన పటేల్ మాదిరిగానే ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ కశ్మీర్ సమస్యను పరిష్కరించారని కొనియాడారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీలో నిర్వహించిన 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌కు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ కూడా పాల్గొన్నారు. పరేడ్ సందర్భంగా అమిత్ షా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 
నిర్భయంగా, నిజాయతీగా సేవ చేయండి.. 
అనంతరం పరేడ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు పటేల్‌ ఎంతో కృషి చేశారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి కేంద్ర హోం మంత్రి హోదాలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులకు అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తికాగానే లక్ష్యం పూర్తయినట్లు కాదన్నారు. అసలు లక్ష్య సాధన విధుల్లో చేరడంతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిర్భయంగా, నిజాయతీగా పనిచేస్తూ, దేశాభివృద్ధికి పాటుపడలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ విధులు నిర్వహించినా, అందరి సమన్వయంతోనే విజయం సాధించగలమని తెలిపారు. ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడానికి కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు లాంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని ఐపీఎస్ అధికారులకు సూచించారు. 11 మంది విదేశీ అధికారులు.. నేషనల్ పోలీస్ అకాడెమీలో ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా 70వ బ్యాచ్‌లో మొత్తం 92 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 12 మంది మహిళా అధికారులు ఉన్నారు. భూటాన్‌కు చెందిన ఆరుగురు, నేపాల్‌కు చెందిన ఐదుగురు అధికారులు కూడా ఇక్కడే శిక్షణ పూర్తి చేసుకున్నారు. 

No comments:

Post a Comment