Breaking News

24/08/2019

గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు

కర్నూలు, ఆగస్టు 24 (way2newstv.im - Swamy Naidu)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో పథకాల పేర్లు కూడా మారుతున్నాయి. టీడీపీ హయాంలో ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లతో అమలైన పథకాలకు ప్రస్తుతం వైఎస్ఆర్ పేరుతో అమలుచేస్తున్నారు. ఇక, గ్రామీణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో అక్టోబరు 1 నుంచి గ్రామ సచివాలయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగానే సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసి ఇప్పటికే రాత పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని సచివాలయాలు కొంత రంగు సంతరించుకుంటున్నాయి. వీటికి అధికార పార్టీ జెండా రంగులను పోలిన రంగులు అద్దుతున్నారు.
గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు
కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని బూజునూరు గ్రామ సచివాలయానికి వేయించిన రంగులు వ్యవహారం విమర్శలకు కారణమైంది. ఈ భవనానికి రెండు రోజుల వ్యవధిలోనే రంగులు మార్చడం విశేషం. ఇక్కడ గ్రామ సచివాలయ భవనానికి రెండు రోజుల కిందట వైసీపీ జెండాను పోలిన రంగులను పంచాయతీ సిబ్బంది వేయించారు. అధికార పార్టీ అధికార పార్టీ జెండా రంగులను పోలి ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన అధికారులు ఆ రంగులను తొలగించి శుక్రవారం ఉదయం 11 గంటలకు తెల్లరంగు వేశారు. అయితే, ఈసారి వైఎస్‌ఆర్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన రంగులను వెయించాల్సిందేనని పట్టుబట్టారు. తొలుత వేయించిన రంగులతోనే సచివాలయం ఉండాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్‌సీపీ జెండా తరహా రంగులు వేయించారు. దీంతో గ్రామసచివాలయం రెండు రోజుల్లో మూడుసార్లు రంగులు మారింది. 

No comments:

Post a Comment