Breaking News

10/08/2019

నేను టీడీపీలోనే ఉంటా

విజయవాడ, ఆగస్టు 10 (way2newstv.in - Swamy Naidu)
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పార్టీ మారబోతున్నారా. త్వరలోనే వైసీపీలో చేరేందుకు.. నియోజకవర్గాన్ని మారేందుకు సిద్ధమయ్యారా. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. విదేశీ పర్యటనలో ఉన్న ఉమా సోషల్ మీడియా పోస్టుల్లోనూ ఇవే సంకేతాలు కనిపించాయి. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా చర్చ జరిగింది. తాజాగా విదేశీ పర్యటన నుంచి వచ్చి ఆయన పార్టీ మార్పుపై స్పందించారు. శనివారం బొండా ఉమాను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలిశారు.. ఆయనతో చర్చలు జరిపారు. పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. 
నేను టీడీపీలోనే ఉంటా 
చంద్రబాబు బుద్దాను ఉమా దగ్గరకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తాజా రాజకీయాలపై చర్చించారు. అలాగే పార్టీ మారే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బుద్దా వెంకన్న బొండా ఉమాతో గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం బొండా ఉమా కూడా పార్టీ మార్పుపై స్పందించారట. తాను చంద్రబాబునాయుడు గారితోనే ఉంటానని.. పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పారట. దీంతో వైసీపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఉమా పుల్‌స్టాప్ పెట్టినట్లేనని తెలుగు దేశం పార్టీ నేతలు చెబుతున్నారు. 

No comments:

Post a Comment