అనంతపురం ఆగస్టు 27, (way2newstv.in - Swamy Naidu)
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, హిందూపురం మాజీ ఏంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ తిప్పేస్వామి,మడకశిర మాజీ ఎమ్మేల్యే ఈరన్న ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
మడకశిర లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
ఈసందర్బంగా పరిటాల సునీత మాట్లాడుతూ టిడిపి వ్యవస్థాపకులు,తెలుగువారి ఆరాధ్యదైవము మాజీ ముఖ్యమంత్రి కీ"శే ఏన్టీయార్ విగ్రహం ప్రారంభోత్సవం చేయడము సంతోషంగా వుందన్నారు.బడుగు,బలహీన వర్గాల కోసం టిడిపి పార్టీని స్థాపించి,మూడు నెలలోనే అధికారం చేపట్టిన ఘణత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు,ఏన్టీయార్ , బాలయ్య అభిమానులు తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment