Breaking News

06/08/2019

తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ అయన ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ! ములుగు కలెక్టర్ సి నారాయణరెడ్డి

ములుగు  ఆగస్టు:6  (way2newstv.in- Swamy Naidu )
స్వ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఫోటోకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.
 తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య  జయశంకర్  అయన ఆశయాలకు అనుగుణంగా  బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి  !   ములుగు కలెక్టర్ సి నారాయణరెడ్డి
మన రాష్ట్రం ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు అని, తెలంగాణ నే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారని వారి ఆశయాలకు అనుగుణంగా  బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రమాదేవి, ఏవో శ్యామ్, కలెక్టరేట్, ఆర్ డి ఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment