Breaking News

21/08/2019

గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన

ములుగు, ఆగస్టు 21, (way2newstv.in):
ములుగు నియోజకవర్గం లోని ఏటూరునాగారం తాడ్వాయి మధ్యలో  ఉన్న చింత కుంట గోతి  కోయ  గూడెములో ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు.  ఈ సందర్బంగా గూడెం లో నెలకొన్న  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చిన మీ ఇంటి ఆడబిడ్డగా  మీ కష్ట సుఖాల్లో  పాలుపంచుకుంటానని అన్నారు. 
గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన
మీకు సోలార్ విద్యుత్తు ఏర్పాటు కు కృషి చేస్తానని త్వరలోనే గొత్తి కోయ గుడాలలో హెల్త్ క్యాంప్ నిర్వించే విదంగా ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు.  గొత్తి కోయలకు అండగా ఉంటానని సీతక్క హామీ ఇచ్చారు  ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,  ములుగు మండల అధ్యక్షులు ఎండీ చందూ పాషా .యూత్ మండల అధ్యక్షులు బానోత్ రవిచందర్ దేవరనేని దేవేందర్ రావు .జాటోత్ గణేష్ .సర్పంచ్ సుమన్ .రమణాకర్ చక్రపు రాజు .నరేందర్.చింత క్రాంతి తదితరులు ఉన్నారు

No comments:

Post a Comment