Breaking News

30/08/2019

గాంధీ భవన్ నుంచే రాములమ్మకు సెగ

హైద్రాబాద్, ఆగస్టు 30, (way2newstv.in)
ఫైర్ బ్రాండ్ … లేడీ అమితాబ్… ఐరన్ లేడీ… ఇలా ఎన్ని పేర్లు. 24 ఫ్రేమ్స్ లో సక్సెస్ అయిన విజయశాంతి పాలిటిక్స్ లో మాత్రం విజయాలను మూటగట్టుకోలేక పోతున్నారు. విజయశాంతి ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయినా విజయశాంతి పై ప్రచారం మాత్రం ఆగడం లేదు. విజయశాంతి బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కాంగ్రెస్ నేతలే ఎక్కువగా చేస్తున్నారని విజయశాంతి అనుమానిస్తున్నారు. అదే గాంధీభవన్ కేంద్రంగా తనపై ఈ ప్రచారం అనేక సార్లు జరిగిందని కూడా విజయశాంతి గుర్తు చేస్తున్నారు.విజయశాంతి లోక్ సభ ఎన్నికల తర్వాత మళ్లీ పార్టీకి దూరమయ్యారు. 
గాంధీ భవన్ నుంచే రాములమ్మకు సెగ

విజయశాంతి ఎన్నికలకు ముందే యాక్టివ్ అవుతారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా… ఈసారి మాత్రం ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరం జరగడానికి కారణాలను ఆమే స్వయంగా చెబుతున్నారు. విజయశాంతి తిరిగి తన సొంత గూటికి చేరతారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతుంది. అయితే రాములమ్మ ఈ ప్రచారాన్ని ఖండించలేదు.ప్రచారం తీవ్రంగా జరుగుతున్నప్పటికీ విజయశాంతి వద్దకు ఏ ఒక్క కాంగ్రెస్ నేత రాలేదు. పార్టీలో కొనసాగమని కోరలేదు. ఇది విజయశాంతి ఆగ్రహానికి అసలు కారణంగా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు తనను దూరంగా పెడుతున్నారని విజయశాంతి ఆవేదన చెందుతున్నారట. కార్యక్రమాలు ఎప్పుడు? ఎక్కడ? అన్న సమాచారాన్ని కూడా తనకు కాంగ్రెస్ నేతలు పంపడం లేదంటున్నారు. తాను పత్రికల్లో చూసి కార్యక్రమాల గురించి తెలుసుకోవాల్సి వస్తుందంటున్నారు విజయశాంతి.అందుకోసమే తాను పీసీసీ ముఖ్యనేతలను అడిగానని, అయినా వారి నుంచి సమాధానం రావడం లేదంటున్నారు విజయశాంతి. కావాలనే కొందరు తనను బయటకు పంపించేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని తనకు అర్థమయిందంటున్నారు రాములమ్మ. గాంధీభవన్ నుంచే కొందరు కాంగ్రెస్ నేతలు మీడియాకు తాను బీజేపీ లోకి వెళుతున్నట్లు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద విజయశాంతి కాంగ్రెస్ ముఖ్యనేతల వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నారు. మరి రాములమ్మ ప్రచారాన్ని నిజం చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

No comments:

Post a Comment