అమరావతి జూలై 17 (way2newstv.in)
;ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారని విమర్శించారు. సభలో ఎక్కడ కూర్చోవాలనే విషయంలో కూడా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ‘నిబంధనల ప్రకారమే శాసనసభలో సభ్యులకు సీట్ల కేటాయింపు జరిగింది.
ఏపీ అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై వాగ్వాదం
అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరీలు ఒకరి సీటులో మరొకరు కూర్చొన్నారని వైకాపా అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలయ్యింది. సీట్లు కేటాయింపు విషయంలో.. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తయినా రూల్స్ పాటించాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా.. ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా’ అని సీఎం చురకలంటించారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు..
No comments:
Post a Comment