Breaking News

18/07/2019

నా ఇల్లు కూలగొట్టండి... నేను రోడ్డు మీద పడుకుంటా :చంద్రబాబు

అసెంబ్లీలో కరకట్ట రగడ 
విజయవాడ, జూలై 18 (way2newstv.in)
ప్రజావేదిక కూల్చివేతపై గురువారం అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల సమయంలో హాట్ హాట్‌గా చర్చలు జరిగాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నిబంధనలను ఉల్లంఘించారని సీఎం జగన్ ఆరోపించగా.. ముఖ్యమంత్రి విమర్శలకు ప్రతిపక్ష నేత అంతే ఘాటుగా బదులిచ్చారు. మీరు నన్నేం చేస్తారో చేయండి. నాకేం బాధలేదన్న బాబు.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎన్ని పడటానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అవసరమైతే రోడ్డు మీద పడుకొని పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. నది, కాలువ గట్ల మీద 70 వేల నిర్మాణాలను గుర్తించామని చెబుతున్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వ భవనాన్ని కూల్చారు. 
నా ఇల్లు కూలగొట్టండి... నేను రోడ్డు మీద పడుకుంటా :చంద్రబాబు

రాష్ట్రంలోని జరుగుతున్నపరిణామాల పట్ల ప్రజలందరూ ఆవేదనలో ఉన్నారు, ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పరిధిలో నేనేక్కడా ఇళ్లు కట్టలేదన్న చంబ్రాబు.. రమేశ్ అనే బిల్డర్ కట్టిన ఇంట్లో తాను నివాసం ఉంటున్నానని తెలిపారు. ‘‘ప్రజావేదిక నా భవనం కాదు. అది ప్రభుత్వ భవనం. నేనెక్కడా ఇల్లు కట్టలేదు. నాకు ప్రజావేదికను కేటాయించాలని లేఖ రాస్తే.. దాన్ని కూల్చేశారు. రోడ్ల మీద ఉన్న విగ్రహాలు ఉన్నప్పుడు వాటి వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఉంది. కాబట్టి వాటిని కూడా కూల్చేస్తారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. నేను చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిని. అన్ని రూల్స్‌లోనూ సుప్రీం కోర్టు తీర్పు ఉంది. దాన్ని మీరెందుకు అమలు చేయరు అని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. వేరే అంశాలను మాట్లాడొద్దని, అనవసరంగా సభా సమయం వృథా చేయొద్దని చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సూచించారు. స్పీకర్ సూచనల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 40 ఏళ్లు అసెంబ్లీలో ఉన్నా.. ఏం మాట్లాడో నాకు తెలీదా అధ్యక్షా? అని స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీరు నన్ను ప్రొటెక్ట్ చేయాలి.. ఇలా చేయడం ఏంటి..? నేను తప్పుగా మాట్లాడానా..? మీరు నా నోరు మూయించొద్దు.. వైఎస్ఆర్సీపీ వాళ్ల నోళ్లను మూయించండని స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు ఆగ్రహంగా మాట్లాడారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. ప్రశ్నకు అనుగుణంగా సమధానం చెప్పాలని మాత్రమే కోరుతున్నాను. సభా మర్యాదలను కాపాడుకోవాలని, సభా సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని మొత్తం అక్రమ కట్టడాల గురించి చర్చ జరుపుదాం. మీ నోరు మూయించాలని ఎవరికీ లేదు. ప్రశ్నలు అడగాలనుకున్న మిగతా నేతల పరిస్థితి ఏంటి..? అని స్పీకర్ ప్రశ్నించారు. మీరు డివియేట్ అయితే మాత్రం అందుకు అనుమతించనని చంద్రబాబుకు గవర్నర్ సూచించారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ప్రజావేదికను నిర్మించారని చెబుతున్నారు. మాజీ సీఎం అడిగారు కాబట్టి దాన్ని కూల్చారు. చట్ట వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డివి కొన్ని వేల విగ్రహాలు పెట్టారు. అలాంటి జగన్.. అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతున్నారా? నా ఆవేదనంతా 74 వేల మంది పేద ప్రజానీకం గురించి అధ్యక్షా అని చంద్రబాబు తెలిపారు. 

No comments:

Post a Comment