Breaking News

18/07/2019

సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి....

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన బిసి డి వో వసంత... 
వనపర్తి జూలై 18 (way2newstv.in)
కస్తూర్బా పాఠశాలల్లో, కళాశాలలో ఉన్న సౌకర్యాలు మరి ఇక్కడ లేవని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని బిసి డి ఓ వసంత విద్యార్థినిలకు సూచించారు. ఆమె గురువారం గోపాల్ పేట లోని కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 
 సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి.... 

అధ్యాపకులు లేక కళాశాల విద్యార్థులు టీసీలు తీసుకొని చాలా మంది వెళ్లిపోయారు అన్న విషయం తెలుసుకున్న ఆమె గెస్ట్ ఫ్యాకల్టీగా ముగ్గురు అధ్యాపకులను తీసుకున్నట్లు ఆమె తెలిపారు. దీంతో అధ్యాపకుల సమస్య తీరుతుందని, దీంతో విద్యార్థులు పాఠశాలలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగపరుచుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె అవగాహన కల్పించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ దీప్తి. అధ్యాపకులు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment