Breaking News

12/07/2019

చిట్టచివరి భూముల వరకూ సారు నీరు

విజయవాడ, జూలై 12 ,(way2newstv.in):
ఖరీఫ్ రైతాంగం పంటలు సాగుచేసుకోవడానికి కాలువ చిట్టచివరి భూముల నీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్  అన్నారు. సాగు త్రాగునీటి అవపరాల కోసం కృష్ణాజిల్లాలోని కాలువలకు ప్రకారం బ్యారేజ్ నుండి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పౌర సరఫరాల  శాఖ మంద్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య , దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కె.యి.కానాల్ హెడ్ స్లూయిస్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి,  నీటిని విడుదల చేశారు.  

చిట్టచివరి భూముల వరకూ సారు నీరు
ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడం గోదావరికి వరద కూడా ఆలస్యం కావడంతో కృష్ణా డెల్డాకు నిరు విడుదల చేయడంలో కింత ఆలస్యం జరిగిందన్నారు. రాబోయే పది రోజుల్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు కూడా నీరు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి.ఇంతియాజ్ మాట్లాడుతూ  గోదావరికి వరద రావడంతో గోదావరి సిస్టంలోని 23 పంపులు ఆన్ చేసి నీరు తీసుకురావడం జరిగిందన్నారు. రెండు రోజుల్లో 0.8 టి.యం.సి నీరు వచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి నీరు చేరగానే సాగునీటి సలాహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని కృష్ణా డెల్టా రైతాంగానికి ప్రస్తుతం  1000 క్యూసెక్కుల నీటిని కె.ఇ.బి.కెనాల్ కు విడుదల చేయడం జరిగిందన్నారు. కృష్ణా డెల్టాకు సుమారు 150టియంసిల నీరు  అవసరం అవుతుందని, 80 టియంసిలు గోదావరి నుండి 60 టియంసిలు పులిచింతల నాగార్జునసాగర్ నుండి మిగిలినవి మునేరు ఇతర నీటి వనరుల నుండి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జోగి రమేష్, మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, దూలం నాగేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ యం.వెంకటేశ్వరరావు, సంతోష్ కుమార్, చౌదరి, కెసి డివిజన్ ఇఇ స్వరూప్ కుమార్, వేణుగోపాల్, తిరుమలరావు, నీటి  సంఘాల ప్రతినిధులు ఆళ్ళు గోపాలకృష్ణ, శివరాంకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment