Breaking News

12/07/2019

ఆరోగ్య శ్రీకు భారీ నిధులు

విజయవాడ, జూలై 12, (way2newstv.in)
ఆరోగ్యశ్రీ ఆ పేరు వింటేనే పేదవాడి మొహంపై చిరునవ్వు కనిపిస్తుంది. వారికి ఆరోగ్య భద్రత కల్పించి, కార్పొరేట్ వైద్యాన్ని వారికి చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి ఈ పథకం ప్రధాన కారణం కూడా. ఈ స్కీమ్ వైఎస్‌ని తిరుగులేని నేతగా ఆదరణని తెచ్చిపెట్టింది. అయితే వైఎస్సార్ మరణాంతరం ఈ పథకం సరిగా అమలు కాలేదన్న విషయం అందరికీ తెలుసు. అయితే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకానికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఏపీ బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు ఆర్థిక మత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 
 ఆరోగ్య శ్రీకు  భారీ నిధులు

ఈ సందర్భంగా ఆయన రామాయణంలోని ఓ ఘట్టాన్ని గుర్తు చేశారు. ఇంద్రజిత్‌ అస్త్రానికి కుప్పకూలిన లక్ష్మణుడిని మూర్ఛ నుంచి లేపేందుకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినట్లు దివంగత నేత వైఎస్సార్ ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారని అన్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న అన్ని కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ఆయన తెలిపారు. అంటే నెలకు రూ.40,000 ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది. దీంతో మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. బడ్జెట్‌లో దీనికోసం రూ.1,740 కోట్లు కేటాయించారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడబోమని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కూడా వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు. ఇకపోతే రూ.143 కోట్లతో 432 అదనపు 108 అంబులెన్స్ కొనుగోలు చేస్తామని తెలిపారు. అలాగే 104 సేవల కోసం రూ.180 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 676 అదనపు 104 వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రూ.1,500 కోట్లు కేటాయింపులు జరిపారు

No comments:

Post a Comment