Breaking News

06/06/2019

విజయసాయిరెడ్డిపై విరుచుకపడ్డ బుద్దా


విజయవాడ, జూన్ 6, (way2newstv.in)
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు.  గురువారం అయన మీడియాతో మాట్లాడారు.  అయ్యా తప్పుడు లెక్కల మాస్టారూ ... ఒక్క సారి ఈ లేఖ చూడండి.... మా అధ్యక్షులు రాసిన మొదటి లేఖ రాష్ట్ర సమగ్రాభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారం,పేదల సంక్షేమమే లక్ష్యంగా నూతన ముఖ్యమంత్రి జగన్ గారు పని చెయ్యాలి అని చెబుతూ శుభాకాంక్షలు తెలియజేసారు. మీ తప్పుడు లెక్కలు,తప్పుడు రాతలు ఇకనైనా ఆపండని అన్నారు. 


విజయసాయిరెడ్డిపై విరుచుకపడ్డ బుద్దా 
మహానేత ఆశీస్సులతో మీ యువమేత మేసిన లక్షల కోట్లతో  ఎలహంక ప్యాలెస్ లో లో పోలీసులకు ప్రవేశంలేదని అన్నారు. లోటస్పాండ్లో వైకాపా నేతలకూ ఎంట్రీలేని ఇంద్రభవనం. తాడేపల్లిలో రాజుల కోటల్ని తలదన్నే రీతిలో రాజప్రాసాదం కట్టుకునే స్థోమత ఉంటే మీరెందుకీ లేఖ రాస్తారని ప్రశ్నించారు. గెలిచిన తరువాత అమరావతి కి ఎంట్రీ ఇచ్చిన చరిత్ర మీది. బస్సు లో ఉంటూ పరిపాలన ప్రారంభించి ఆంధ్రుల కల అమరావతి సాకారం చేసే దశగా అడుగులు వేసింది మా అధినేత. పేదలకు నాణ్యత తో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించారే తప్ప మీలా విలాసవంతమైన భవనాలు నిర్మించుకోలేదని అన్నారు. మీ తప్పుడు లెక్కలతో ఎంతో మందిని జైలుకి పంపారు... ఇప్పుడు తప్పుడు రాతలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి అని చూస్తున్నారని ఆరోపించారు.

No comments:

Post a Comment