Breaking News

06/06/2019

తెలంగాణలో హత్యా రాజకీయాలు


హైదరాబాద్, జూన్ 6, (way2newstv.in)
పశ్చిమ బెంగాల్ కేరళ తరహా హత్యా రాజకీయాలను తెలంగాణలో కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.. స్థానిక సంస్థల ఫలితాల అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని డోకుర్ గ్రామంలో జరిగిన ఘర్షణలో మరణించిన.బీజేపీ కార్యకర్త    ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని ఆయన గురువారం పరామర్శించారు... ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పుంజుకోవడంతో కేసీఆర్ సహించలేకపోతున్నారు అని అన్నారు.. 


తెలంగాణలో హత్యా రాజకీయాలు
పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై తెరాస పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి దాడులను తిప్పి కొట్టేందుకు బిజెపి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పార్టీకోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్న బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా అని తెలిపారు.. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన కొనసాగించాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తెచ్చేవిధంగా కార్యకర్తలంతా కృషి చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు...

No comments:

Post a Comment