తనను గవర్నర్గా నియమించినట్లు వచ్చిన వార్తలు కరెక్టు కాదని బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఆమె గవర్నర్గా నియమితులైనట్లు ముందుగా కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. గవర్నర్గా నియమితులైనందుకు శుభాకాంక్షలు అని ఆయన ట్విట్ చేశారు.
గవర్నర్గా నియామకం వార్తలు కరెక్టు కాదు: సుష్మా
దాంతో అందరూ సుష్మా స్వరాజ్ గవర్నర్గా నియమితులైనట్లు భావించారు. అయితే నిజం తెలుసుకున్న కేంద్రమంత్రి తన ట్విట్ను ఉపసంహరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా తాను నియమితులైనట్లు వచ్చిన వార్తలపై బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ వార్త అబద్ధమని తేల్చారు.
No comments:
Post a Comment