Breaking News

11/06/2019

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్


షాద్ నగర్, జూన్ 11 (way2newstv.in
కేశంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యాక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  పాల్గొని 94 మంది లబ్ధిదారులకు ఒక కోటి విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. తరువాత  ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తోంది. 


లబ్ధిదారులకు చెక్కులు  పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ 
పెండ్లి కోసం ఖర్చును ఊహించని బ్రూన  హత్యలకు పాల్పడుతున్నారు. పరిపాలనలో అడుగడుగునా మానవీయ విలువలు ప్రతిభింభించాలని భావించి, పేద ఆడపిల్లల పెండ్లికి ఆర్ధికంగా అడుగడుగునా నిలవాలని  ఈ పథకం ప్రవేశపెట్టారని, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కేసీఆర్  హృదయానికి దగ్గరైన పథకం.  జనం మెచ్చిన పథకం అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు.

No comments:

Post a Comment