Breaking News

03/06/2019

ఇక రెవెన్యూ డివిజన్లలలో సీసీ కెమెరాలు


గుంటూరు, జూన్3, (way2newstv.in)
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఎప్‌ఎల్‌) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, రూ.969 కోట్లు కేటాయించింది. మేట్రిక్స్‌ సంస్థ ఈ పనులు చేపడుతోంది.సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాల ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నిఘా కెమెరాల ఏర్పాటు పూర్తికావడంతో కొద్ది రోజుల్లో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం పట్టణం, ప్రధాన కూడళ్లే కాకుండా మారుమూల గ్రామాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యనే కాకుండా శాంతి భద్రతల రక్షణ, నేరాల అదుపు వంటి బహుళ ప్రయోజనాలకు ఈ వ్యవస్థను వినియోగించుకునేందుకు పోలీసుల శాఖ ముందడుగు వేసింది. 


ఇక రెవెన్యూ డివిజన్లలలో సీసీ కెమెరాలు
సీసీ కెమెరాలతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలాన్లు రాసేందుకేనన్న విమర్శలున్నాయి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఆధునతన పరిజ్ఞానంతో కెమెరాలను ఏర్పాట చేస్తున్నారు. నేరాల నియంత్రణకు వీటిని ఎంచుకోవడం విశేషం! హైటెక్‌ సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,764 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టరు, సబ్‌ డివిజన్‌ హెడ్‌క్వార్టర్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కెమెరాల ఏర్పాటు పూర్తి కావచ్చింది. త్వరలో కంట్రోల్‌ రూమ్‌ల కేటాయింపులు చేపట్టనున్నారు. అడ్వాన్స్‌డ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌(ఏఎన్‌పీఆర్‌), రెడ్‌ లైట్‌ వయోలేషన్‌ రికగ్నిషన్‌(ఆర్‌ఎల్‌వీడీ), ఫస్త్రస్‌ రికగ్నిషన్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌), వీడియో అనలైటిక్స్‌(వీఏ) వంటి నాలుగు రకాల ఆధునాతన కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తెనాలి సబ్‌ డివిజన్‌లోని 10 పోలీస్‌స్టేషన్లకు గాను 107 కెమెరాలను కేటాయించారు. వీటిలో ఏఎన్‌పీఆర్‌ – 45, ఎఫ్‌ఆర్‌ఎస్‌ – 5, వీఏ – 20, ఆర్‌ఎల్‌వీడీ, సాధారణ కెమెరాలు 37 ఉన్నాయి.అధునాతన కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏ ఎత్తయితే, దీని నిర్వహణ తలకు మించిన భారం కానుంది. తెనాలి పట్టణంలో 2012లోనే 48 కూడళ్లలో అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం రూ. 15 లక్షలు కేటాయించి, మార్కెట్‌ కాంప్లెక్సులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుకూ అనుమతిచ్చింది. నేర పరిశోధనల్లో ఈ కెమెరాలూ ఉపయోగపడ్డాయి. అయితే తదనంతర కాలంలో వీటి నిర్వహణపై ఇరు శాఖలు పట్టించుకోలేదు. దీంతో కెమెరాలు నిరుపయోగమయ్యాయి. కెమెరాల దీర్ఘకాలిక నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment