Breaking News

20/05/2019

పెళ్లి చేసుకుంటానని మెసం చేశాడు


రంగారెడ్డి, మే 20 (way2newstv.in)
ఇంట్లో పనిచేస్తున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యజమాని కొడుకు ఆమెను లొంగదీసుకుని లైంగికంగా వాడుకున్నాడు. తీరా ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, తాను బిజినెస్‌లో నిలదొక్కుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతడు తనను మోసం చేశాడని తెలుసుకున్న బాధితురాలు హైదరాబాద్ బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. అక్కడక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. అయితే ఇక్కడ తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవడంతో రెండేళ్ల క్రితం సొంతూరికి వెళ్లిపోయాడు. 



పెళ్లి చేసుకుంటానని మెసం చేశాడు

తన కూతురి(19)ని బాలానగర్‌లోని ఓ ఇంట్లో ఉంచి ఏదైనా ఉద్యోగం వెతుక్కోమని చెప్పాడు. అయితే ఆ యువతికి ఎక్కడా ఉద్యోగం దొరక్క ఆ ఇంట్లోనే పనిమనిషిగా మారింది. ఈ క్రమంలోనే ఇంటి యజమాని కొడుకు యువతిపై కన్నేశాడు. 6 నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. అలా అనేకసార్లు తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరినప్పుడల్లా సెటిల్ కాగానే చేసుకుంటానని నమ్మబలికేవాడు. కొద్దిరోజుల తర్వాత ఈ వ్యవహారం యువకుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు యువతి తండ్రిని పిలిపించి విషయం చెప్పాడు. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి షాకైన అతడు ఆమెను పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. తన కొడుకు కాస్త స్థిరపడగానే పెళ్లి చేస్తానని ఇంటి యజమాని చెప్పడంతో తన కుమార్తెను తీసుకుని అతడు కర్ణాటకు వెళ్లిపోయాడు. ఆరు నెలలు గడుస్తున్నా పెళ్లి ప్రస్తావన తేకపోవడంతో బాధితురాలు తండ్రికి చెప్పకుండా హైదరాబాద్‌కు చేరుకుని కామాంధుడిని నిలదీసింది. యువతి నుంచి తప్పించుకునేందుకు అతడు మళ్లీ మాయమాటలు చెప్పడంతో బాధితురాలు బాలానగర్ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment