Breaking News

27/05/2019

రాజకీయాల్లో గెలుపోటములు సహజం: మాజీ ఎంపీ కవిత


నిజామాబాద్‌ మే 27  (way2newstv.in)
నిజామాబాద్‌ నియోజకవర్గాన్ని ఎప్పటికీ వీడనని నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు  సహజమని నిజామాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మంచికప్పలో తెరాస కార్యకర్త కిశోర్‌ గుండెపోటుతో మరణించగా.. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆమె పరామర్శించారు. 


రాజకీయాల్లో గెలుపోటములు  సహజం: మాజీ ఎంపీ కవిత
అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తానూ ఓడినంత మాత్రాన తెరాస కార్యకర్తలకు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రజల మధ్య ఉంటూ.. అందరికీ అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. పదవులు ఉన్నా..లేకున్నా తెలంగాణ కోసం పని చేస్తానని వెల్లడించారు. ఓటమితో నిరాశ చెందకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ‘‘ఈసారి ప్రజలు నన్ను కాదని వాళ్లని గెలిపించారు. గెలిచినవారు హామీలు నెరవేర్చాలి’’ అని అన్నారు.

No comments:

Post a Comment