Breaking News

27/05/2019

జూన్ 7-8వ తేదీల్లో మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నప్రదాని మోడీ?

న్యూఢిల్లీ మే 27(way2newstv.in)

భారత ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత న‌రేంద్ర‌మోదీ ద‌క్షిణాసియా దేశం మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు వ‌రుస‌గా రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ఇదే కావ‌డం విశేషం. జూన్ మొద‌టివారంలో భార‌త ప్‌్ధాని మాల్దీవుల రాజ‌ధాని మాలే రానున్నార‌ని ఆదేశ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. . జూన్ 7-8వ తేదీల్లో ఈ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.


జూన్ 7-8వ తేదీల్లో మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నప్రదాని మోడీ?
దీనిపై ఆదేశ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతం చేసుకోవ‌డం ల‌క్ష్యంగా ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. 2014లో తొలిసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం స‌రిహ‌ద్దు దేశం భూటాన్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ఈనెల 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

No comments:

Post a Comment