Breaking News

27/05/2019

31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్


విజయవాడ, మే 27(way2newstv.in)
ఏపీలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు ముహుర్తం కుదిరింది. ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం పూర్తయిన మరుసటి రోజే.. అంటే మే 31న ఏపీలో వర్మ సినిమా ‘లక్ష్మీఎస్ ఎన్టీఆర్ ’ విడుదల కానుంది. ఇన్నాళ్లు ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నందున విడుదలకు అవాంతరాలు ఎదురయ్యాయి. 


31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్
తెలంగాణలో ఎప్పుడో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న..ఏపీలో మాత్రంఈ సినిమాకు కష్టాలు తప్పలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సినిమాను రిలీజ్ చేయలేమని అధికారులు తెలిపారు. దీనిపై వర్మ పెద్ద ఫైటే చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.తాజాగా వర్మ సినిమా విడుదలకు సంబంధించి ట్వీట్ కూడా చేశారు. మే 30న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వారం చేయనున్నారని, మే 31న సినిమాను అక్కడ విడుదల చేస్తామని వర్మ పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో జరగనున్నాయని వర్మ ట్వీట్‌లో తెలిపారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత పలు చోట్ల సినిమాను విడుదల చేసిన... దాడులు చేసి నిలిపివేశారు. పలు థియేటర్లపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.

No comments:

Post a Comment