రంగారెడ్డి మార్చ్ 30 (way2newstv.in)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవవర్గం ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ సమీపంలో ఉన్న సాగర్ రబ్బర్ పరిశ్రమలో లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చాలాకాలంగా ఈ కంపెనీ నడవడం లేదని సమాచారం రబ్బరుకు సంబంధించిన వస్తువులు ఇందులో వృధాగా పడి ఉన్నాయి వేసవికాలం కావడంతో మంటలు వ్యాపించి కంపెనీ దగ్ధం అయ్యేందుకు కారణం అయ్యిందని స్థానికులు చెప్తున్నారు
రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
అదేవిధంగా ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఇద్దరు కార్మికులు ఉన్నారని సమాచారం వారు ప్రమాదం జరిగిన వెంటనే బయటికి పరిగెట్టటంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు
No comments:
Post a Comment