Breaking News

01/04/2019

ప్రభాకర్ రెడ్డికి అత్యధిక మేజారిటీ ఇవ్వాలి

సిద్దిపేట, మార్చ్ 30  (way2newstv.in)
దేశంలో అత్యధిక మెజారిటీ తో గెలిచే వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి.  సిద్దిపేట కు ఎన్నికలు కొత్తకాదు.  మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించాం.  కొత్త ప్రభాకర్ రెడ్డి కి గొప్ప విజయం ఇచ్చే బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.   ప్రతి ఒక్కరు పోలింగ్ శాతం పెంచేలా కృషి చేయాలి.  పక్క నియోజకవర్గ నాయకులు మనకు సవాలు వేస్తున్నారు లక్ష మెజార్టీ ఇస్తామని మనం అందరికంటే ఎక్కువ ఇవ్వాలని అయన అన్నారు.  గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితి లేదు.  పది రోజులు మీరు కష్టపడితే5ఏండ్లు జోడెడ్లలాగా కష్టపడుతాం.   మీ ప్రేమ తో నాకు అత్యధిక మెజారిటీ ని అందించారు.  రేపు లోక్ సభ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కి దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇద్దామని అన్నారు. ఐదు సంవత్సరాల మీ కోసం మేం కష్టపడుతాం.  తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే వ్యక్తి ప్రభాకర్ రెడ్డి.   


 ప్రభాకర్  రెడ్డికి అత్యధిక మేజారిటీ ఇవ్వాలి

సిద్దిపేటకు జాతీయ రహదారి, పాస్ పోర్ట్ సేవా కేంద్రం, కేంద్రీయ విద్యాలయం తెచ్చిన ఘనత ప్రభాకర్ రెడ్డిదే. - సిద్దిపేట రైల్వే పనులు బులెట్5స్పీడ్ తో సాగుతున్నాయి.  హైదరాబాద్ నుండి కరీంనగర్ రైల్వే భూసేకరణ కోసం ప్రభుత్వం400కోట్లు ఖర్చుపెట్టింది. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదని మాట్లాడడం విడ్డురంగా ఉందని అన్నారు. కేసీఆర్ సీఎం కాకుంటే సిద్దిపేటకు రైలు అనేది కల గానే ఉండేది.  నాలుగు దశాబ్దాలుగా నినాదాలు గా ఉన్న పనులను ఈ రోజు నిజం అవుతున్నాయి.  రైలు వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.  రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో మేం కష్టపడి మీ రుణం తీర్చుకుంటాం.  అందరం కష్టపడి సిద్దిపేట నుండి లక్ష మెజారిటీ ఇవ్వాలి, తక్కువైతే నా గౌరవం తగ్గుతుంది.   వచ్చే 5 ,6 నెలల్లో కాళేశ్వరం నీళ్లు తెస్తాం.   వచ్చే నెల నుంచి పెన్షన్ 1000 నుండి 2016 కు పెంచుతాం.  వచ్చే నెల 3న నర్సాపూర్ లో జరిగే కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం చేయాలి.నియోజకవర్గం నుండి20 వేల మంది రావాలని అయన సూచించారు.

No comments:

Post a Comment