Breaking News

22/04/2019

ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 22 (way2newstv.in)
ఆదివారం  శ్రీలంక లో జరిగిన ఉగ్రదాడులపై ప్రభుత్వం సమగ్ర  దర్యాప్తుకు ఆదేశించింది.  ఆదివారం రాత్రి సమావేశమయిన జాతీయ భద్రతా మండలి అన్నీ ప్రార్ధనాస్థలాలకు రక్షణ పెంచాలని సూచించింది.  ఉగ్రదాడులపై దర్యాప్తు చేసేందుకు నేషనల్ ఆపరేషన్ప్ సెంటర్ ను నెలకొల్పింది. వెయ్యికి మందికి పైగా సైనికులు, పోలీసులను రంగంలోకి దించింది.  ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో దేమతగోడ ప్రాంతంలో ఒక ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు పోలీసు అధికారులు అక్కడ జరిగిన పేలుడులో మరణించారు. దేశవ్యాప్తంగా రెండు రోజులు స్కూళ్లకి సెలవు ప్రకటించారు.శ్రీలంక ప్రధాన మంత్రి రనిల్ విక్రమసింఘే మాట్లాడుతూ ఏడుమంది తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వీరంతా శ్రీలంక జాతీయులేనని అయన అన్నారు.  


ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం

అయితే,  ఉగ్ర ముప్పు పొంచి ఉందని 10 రోజుల ముందుగానే ఆదేశ ఇంటెలిజెన్స్ సంస్థకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. లంకలో వరుస పేలుళ్లు జరిగే అవకాశం ఉందని ఆదేశ పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర ముందుగానే హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ చర్చిలను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులు చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఆయన నివేదికలు పంపారు. ఇలాంటి మారణహోమం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఏప్రిల్ 11న ఉన్నతాధికారులకు నిఘా సమాచారాన్ని కూడా ఆయన అందించారు.ఓ విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సైతం ఇదే విషయాన్ని లంక ప్రభుత్వానికి తెలియజేసినట్లు తాజాగా వెల్లడైంది. నేషనల్ తోహీత్ జామాత్(ఎన్‌టీజే) అనే సంస్థ ప్రముఖ చర్చీలతో పాటు కొలంబోలోని ఇండియన్ హైకమీషన్ కార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాడికల్ ముస్లిం గ్రూప్ ఎన్‌టీజే గతేడాది వెలుగులోకి వచ్చింది. ఆపేలుళ్ల సమాచారం ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడం కచ్చితంగా నిఘా వైఫల్యమేనని వాదనలు వినిపిస్తున్నాయి. 

No comments:

Post a Comment