Breaking News

04/04/2019

చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

తిరుపతి, ఏప్రిల్ 04 (way2newstv.in)  
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు ఠీవీగా ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.   కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.


చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

వాహన సేవ అనంతరం ఉదయం 11.00 గంటల నుండి 12.00 గంటల వరకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు.
 సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు హంస వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేశారు.
 ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. 'సోహం' భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి 'దాసోహం' అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహించారు. 

No comments:

Post a Comment