Breaking News

01/03/2019

టీఆర్ ఎస్ తోనే బీసీలకు భరోసా

టీబీసీ ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్
జగిత్యాల  మార్చి 01 (way2newstv.in)
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బీసీలకు భరోసా ఏర్పడిందని టీబీసి ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీబీసీ ఐకాసా జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా నేత్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో 46 మంది బీసీ జేఏసీ నాయకులు నేత్రదాన పత్రాలను హరి అశోక్ కుమార్ కు అందజేశారు. 


టీఆర్ ఎస్ తోనే బీసీలకు భరోసా 

ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని కార్యవర్గాలచే హరి అశోక్ కుమార్ ప్రమాణం చేయించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని బీసీ కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు నిధులు సీఎం కేసీఆర్ ఇస్తూ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిసి ఉప ప్రణాళిక ఆర్థిక సామాజిక అభివృద్ధి చట్టసభల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు సంపన్న శ్రేణి ఎత్తివేత వంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీసీ ఐకాసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి బండారి విజయ్, నాయకులు ఆకుల రాజన్న, లచ్చయ్య, వెంకటేశం, గంగారాం, గట్ల మహేశ్, దశరథం, పంచాల రాంకుమార్, ఏనుగంటి రవికుమార్, జిల్లా బీసీ సంక్షేమ జేఏసీ, యువజన జేఏసీ, వివిద మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment