Breaking News

13/03/2019

ఎవ్వరికి పట్టని ‘లక్ష్మీస్ వీరగ్రంథం

బెంగళూర్, మార్చి 13, (way2newstv.in)
లక్ష్మీ పార్వతిని దేవతగా చూపిస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు లక్ష్మీ పార్వతిని దెయ్యంగా చూపిస్తూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వీయ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు బోలెడంత ప్రచారం వచ్చేసింది. వర్మ తనదైన స్టైల్లో ఈ చిత్రానికి ఎక్కడలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టేశారు. అయితే, ఈ సినిమాకు పోటీగా వస్తోన్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రం గురించి పట్టించుకునే నాథుడే లేడు. వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తోందని తెలిసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇటీవలే విడుదల చేసిన ‘ద్రోహం విద్రోహం’ పాట కూడా ఆదరణ పొందలేదు. 


ఎవ్వరికి పట్టని ‘లక్ష్మీస్ వీరగ్రంథం

ఇదిలా ఉంటే, తాజాగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా డైనమిక్ ట్రైలర్‌ను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసిన వాళ్లు ‘ద్యావుడా’ అనక మానరు. అంత అద్భుతంగా, సృజనాత్మకంగా ఉంది ట్రైలర్. అసలు ఇలాంటి ట్రైలర్‌ను ఇప్పటి వరకు మీరు చూసుండరు. అందుకేనేమో దీనికి డైనమిక్ ట్రైలర్ అని పేరు పెట్టారు దర్శకుడు. గుమ్మానికి ఇరువైపులా దీపాలు, లోపల ఎక్కడో ఎన్టీఆర్ ఆకారంలో ఒక మనిషి, గుమ్మాన్ని దాటుకొని ఓ మహిళ లోపలికి వెళ్లడం, ఓ గద్ద అరుచుకుంటూ తిరగడం ఇదీ ఈ ట్రైలర్. అసలు ఈ ట్రైలర్‌తో ఏం సాధిద్దామని కేతిరెడ్డి అనుకున్నారో అర్థం కావడం లేదు. ట్రైలరే ఇంత అద్భుతంగా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులే అర్థం చేసుకోవాలి. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని కేతిరెడ్డి చెబుతున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి చిత్రాన్ని గతంలో చూడని విధంగా ‘లక్ష్మీస్ వీరగంథ్రం’ను తెరకెక్కిస్తున్నారట. ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అంటున్నారు.

No comments:

Post a Comment