తిరుమల, మార్చి 26 (way2newstv.in)
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శ్రీ అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున మంగళవారం ఉదయం పెద్ద మర్యాద చేశారు. ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు.
తిరుమలలోశ్రీ అహోబిల మఠం స్వామీజీకి పెద్దమర్యాద
అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందచేశారు. అహోబిలంలో పురాతన ప్రాశస్త్యం గల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం కొలువై ఉంది. శ్రీవారి అపరభక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ఇక్కడ దీక్ష పొంది మంత్రోపదేశం పొందారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారని ప్రాశస్త్యం.
No comments:
Post a Comment