Breaking News

04/02/2019

టీడీపీలోకి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

గుంటూరు, ఫిబ్రవరి 4, (way2newstv.in)
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును టీడీపీ నేతలు కలిశారు. గుంటూరు జిల్లా తెనాలిలో శేషగిరిరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్ రావు, వర్ల రామయ్య, జలీల్ ఖాన్‌లు దాదాపు గంటసేపు ఆదిశేషగిరిరావుతో చర్చలు జరిపారు. ఈ భేటీలో ఆయన పార్టీలో చేరే అంశం దాదాపు ఖాయమయ్యిందని తెలుస్తోంది. ఈ నెల 7న పసుపు కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం. ఆదిశేషగిరిరావు జనవరిలో వైసీపీకి రాజీనామా చేశారు. తర్వాత టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే జనవరి 24న చంద్రబాబును కూడా కలిశారు.


టీడీపీలోకి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

కానీ పార్టీలో చేరికపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ మద్దతు లేకుండా తాను ఏ పని చేయనని.. ఏ నిర్ణయాలు తీసుకోనన్నారు. బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న చేస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు, డ్వాక్రామహిళల కోసం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని అభినందించారు. అందుకే మర్యాద పూర్వకంగానే చంద్రబాబును కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్న సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడు టీడీపీ నేతలు కలిసి ఆహ్వానించడంతో చేరికకు ముహూర్తం ఖాయమయ్యిందనే ప్రచారం జరుగుతోంది

No comments:

Post a Comment