విజయవాడ, ఫిబ్రవరి 21, (way2newstv.in)
తెలంగాణ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సుకు గురువారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపివేసి ప్రయాణికులను కిందకు దించేశాడు.
గరుడ బస్సుకు తప్పిన ప్రమాదం
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం అధికారులు వారిని వేరే బస్సులో తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
No comments:
Post a Comment