Breaking News

21/02/2019

గరుడ బస్సుకు తప్పిన ప్రమాదం

విజయవాడ, ఫిబ్రవరి 21, (way2newstv.in)
తెలంగాణ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సుకు  గురువారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపివేసి ప్రయాణికులను కిందకు దించేశాడు. 


గరుడ బస్సుకు తప్పిన ప్రమాదం

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం అధికారులు వారిని వేరే బస్సులో తరలించారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

No comments:

Post a Comment