సికింద్రాబాద్, ఫిబ్రవరి 1 (way2newstv.in)
నేరస్థులపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కటకటాల వెనక్కి వెళ్ళాల్సిందే. సికింద్రాబాద్ లో గురువారం జరిగిన కిడ్నాప్ కేసులో నిందితులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిని రిమాండ్ కు తరలించినట్లు గోపాలపురం ఎసిపి శ్రీనివాసరావు తెలిపారు. సికింద్రాబాద్ సేయింట్ మేరీ కళాశాల వద్ద సాయి అనే యువకుడిని కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షి 100 పోలీసులకు తెలిపాడు. పోలీసులకు గాంధీ ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన యువకుడు సాయికి చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందింది.
కిడ్నాప్ కేసులు ఐదుగురు ఆరెస్టు
బాధితుడు సాయి నుండి పిర్యాదు స్వీకరించిన గోపాలపురం పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దివ్య అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన స్నేహితులతో కలిసి సాయిని అపహరించారు. తనను సాయి ఫోన్లో వేధిస్తున్నాడని దివ్య స్నేహితులకు చెప్పింది.సాయిని పట్టుకుని వెళ్ళి చితకబాదారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని సాయి అపహరణకు ప్లాన్ వేసిన దివ్య తో సహా స్నేహితులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారిలో ఉండగా ఐదుగురిని రిమాండ్ కు తరలించారు.ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని స్థానిక పోలీసులకు పిర్యాదు చేయాలని గోపాలపురం ఎసిపి శ్రీనివాసరావు తెలిపారు.
No comments:
Post a Comment