Breaking News

15/02/2019

పెళ్లి చేశారు..అడ్డంగా బుక్కయ్యారు..

హైద్రాబాద్, ఫిబ్రవరి 15 (way2newstv.in
వాలెంటైన్స్ డే సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కుకు వచ్చిన యువతి, యువకుడిని బెదిరించి బలవంతంగా పెళ్లి చేసిన యువకులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటనలో శ్రీహరిచారి, ఆనంద్, అవినాష్, అశోక్, సురేష్ కుమార్, చంద్రశేఖర్ అనే ఆరుగురు యువకులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమికుల రోజున బహిరంగంగా తిరిగితే అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామంటూ భజరంగ్‌దళ్ లాంటి హిందుత్వ సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆక్సిజన్‌ పార్కులో ఓ జంట కనిపించగా కొంతమంది వారిని బెదిరించి యువతి మెడలో యువకుడితో తాళి కట్టించారు.


పెళ్లి చేశారు..అడ్డంగా బుక్కయ్యారు..

 ఈ పెళ్లిని ఫోన్‌లో రికార్డు చేసిన సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన అమ్మాయి తండ్రి కాంతారెడ్డి జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు సుష్మారెడ్డి సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతోందని, ఎప్పటిలాగే గురువారం కూడా కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఉదయం 7.45 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని పోలీసులకు చెప్పారు. ఉదయం పది గంటలకు ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని, దీంతో కంగారుపడి కాలేజీకి వెళ్లగా ఆమె కాలేజీకి రాలేదని సమాధానం వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత తమ దూర బంధువైన రాకేష్‌తో కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో సుష్మ పెళ్లి జరిగిన వీడియోను దగ్గరి బంధువు ఒకరు పంపారని ఆయన వెల్లడించారు. రాకేష్‌తో సుష్మ పార్కులో ఉండగా వారిని ప్రేమికులుగా భావించిన శ్రీహరి చారి, ఆనంద్ తమ అనుచరులతో కలిసి వారిని అడ్డుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు బలవంతపు పెళ్లి చేసినట్లు జైపాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర తాము కే సు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని బాలానగర్ డీసీపీ పద్మజ చెప్పారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 342, 354, 506 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

No comments:

Post a Comment