Breaking News

01/02/2019

ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న కవిత

కవితకు లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ అభినందన
న్యూ డిల్లీ, ఫిబ్రవరి ,01 ( way2newstv.in)
ఐదు బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని నిజామాబాద్ ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదాయం పన్నుతో వచ్చే నిధులే తప్ప, తెలంగాణలో ఏ పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా మంజూరుచేయలేదని ఆరోపించారు. 2014లో తెలంగాణ ఏర్పడితే, ఏనా డూ రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం శుభాకాంక్షలు తెలుపలేదన్నారు. రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి కేంద్రంపై రాజీలేనిపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఫేం ఇండి యా- ఏషియాపోస్ట్ మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ (శ్రేష్ఠ్ సంసద్) అవార్డును ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మధ్య, సూక్ష్మతరహా పరిశ్రమల సహాయమంత్రి గిరిరాజ్సింగ్ చేతులమీదుగా ఎంపీ కవిత అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల దీవెనలతోనే ఈ అవార్డు దక్కిందని, మరింత ఉత్సాహంగా సేవచేస్తానని చెప్పారు.


ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న కవిత

కేంద్రం చేసిన చిన్న పనులను రాష్ట్రపతి ప్రసంగంలో పెద్దవిగా చేసి చూపిం చారన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏమీ లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో కేంద్రం రైతులకు, మహిళలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని, ఎన్నికలకు ముందు బడ్జెట్లో ఏవైనా ప్రకటించినా, అమలుచేసేలోపే ఎన్నికలు పూర్తవుతాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లుపై నాన్చివేత ధోరణి సరికాదన్నారు. ఓడిన ప్రతిపార్టీ ఈవీఎంలపై మాట్లాడటం తగదన్నారు.130 కోట్లమంది ప్రజలున్న దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. ఈవీఎంలు ట్యాప్ చేశారంటూ ప్రజల్లో అపనమ్మకం కల్పిస్తున్నారని, లండన్లో సైతం ఈవీఎంలపై ప్రెస్మీట్ పెట్టి దేశపరువు తీయవద్దని కోరారు.
బడ్జెట్పై పార్టీలో చర్చించి స్పందన
రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సూచించారని ఎంపీ కవిత చెప్పారు. కేంద్రం.. కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వడం లేదని, బైసన్పోలో భూముల అప్పగింతను నాన్చుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయాలపై ప్రధానమంత్రిని కలిస్తే..సానుకూలంగా స్పందించారని, ఒకసారి సీఎం కేసీఆర్తో కూడా మాట్లాడుతానని చెప్పారని వివరించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎంపీ కవితను లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ అభినందించారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ను కలిసి అవార్డు గురించి తెలిపారు.

No comments:

Post a Comment