Breaking News

09/01/2019

పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపేయమనండి

కేంద్ర మంత్రికి ఒడిశా సీఎం లేఖ
భువనేశ్వర్ (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపివేసేలా చూడాలని కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌కు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ లేఖ రాశారు. ముంపు, పునరావాసం అంశాలు తేలేవరకు పనులను కొనసాగించవద్దని ఆయన లేఖలో కోరారు. పోలవరం నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కుంటోన్న సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, ప్రాజెక్టు పూర్తయితే ఒడిశా వాసులు శాశ్వతంగా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు సార్లు లేఖలు రాశామని చెప్పారు. 



పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపేయమనండి

No comments:

Post a Comment