Breaking News

30/08/2018

అమితాబ్‌ కోసం చిరు గ్రాండ్ పార్టీ

హైద్రాబాద్, ఆగస్టు 30, (way2newstv.in)
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కానుకను ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. చిరు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్నారు అమితాబ్. ఇలాంటి నేపథ్యంలో కూడా ఆయన చిరంజీవి నుంచి వచ్చిన విన్నపానికి నో చెప్పకుండా సైరాలో నటించడానికి ముందుకు వచ్చారు. ఇందులో అమితాబ్‌ది అతిథి పాత్రే. ఆరు రోజుల షూటింగుతో అమితాబ్ పై చిత్రీకరించాల్సిన సీన్లను పూర్తి చేశాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇలా అతిథి పాత్ర చేస్తున్నందుకు అమితాబ్ ఎలాంటి పారితోషకం తీసుకోలేదని వినికిడి. ఈ సినిమాకు నిర్మాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అని వేరే చెప్పనక్కర్లేదు. ఇలా చిరు హోం ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్నందుకు అమితాబ్ డబ్బు తీసుకోలేదట. కోరినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అమితాబ్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి అమితాబ్‌కు డబ్బులిచ్చి అవమానించకుండా ఖరీదైన కానుకలు ఇచ్చారని సమాచారం. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైనే బంగారు, వజ్రాభరణాలను అమితాబ్‌కు మెగా ఫ్యామిలీ కానుకగా ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. తమ విన్నపాన్ని మన్నించి కోరిన సినిమాలో నటించినందుకు ఈ కానుకలతో అమితాబ్‌ను సత్కరించి, ఆయన కోసం గ్రాండ్ పార్టీని కూడా ఇచ్చిందట చిరంజీవి ఫ్యామిలీ. ఈ విషయానికి అధికారిక ధ్రువీకరణ లేకపోయినా..ఇండస్ట్రీలో ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. 



 అమితాబ్‌ కోసం చిరు గ్రాండ్ పార్టీ

No comments:

Post a Comment