Breaking News

30/08/2018

టీడీపీ కేడర్ లో విషాద ఛాయలు

హైద్రాబాద్, ఆగస్టు 30, (way2newstv.in)
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ‌ హఠాన్మరణం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. టీడీపీ ముఖ్యనేతలు కూడా హరి మరణంతో షాక్‌కు గురి అయ్యారు. ప్రస్తుతం అందరూ హైదరాబాద్ చేరుకునే పనిలో ఉన్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కడసారి చూపు కోసం వెళ్తున్నారు. వాస్తవానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్లంతా ఆళ్లగడ్డలో ఉండాల్సింది. ఎందుకంటే.. మంత్రి అఖిలప్రియ పెళ్లి జరుగుతోందక్కడ. ఈ వివాహ వేడుకకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. అంగరంగవైభవ వేడుకకు తెలుగుదేశం పార్టీ ముఖ్యులందరినీ ఆహ్వానించింది మంత్రి అఖిలప్రియ. వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా నారా, నందమూరి కుటుంబ సభ్యులున్నారు. అలాగే చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు... వీళ్లంతా అఖిలప్రియ పెళ్లిలో ఉండాల్సింది. తెలుగుదేశం పార్టీ సందడి అంతా ఆళ్లగడ్డలో ఉండాల్సిన సమయంలో.. హరికృష్ణ‌ మరణం వాళ్లందరినీ విషాదంలోకి నెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రత్యేక హెలీకాప్టర్‌లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. అఖిలప్రియ పెళ్లికి ముఖ్య అతిథులు వీళ్లే. వీరితో పాటు నేతలంతా ఇప్పుడు హైదరాబాద్ దారి పట్టారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ పెళ్లిలో నేతల సందడి కనిపించడం లేదు. నిన్ననే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఈ రోజు వివాహఘట్టం. 



టీడీపీ కేడర్ లో విషాద ఛాయలు

No comments:

Post a Comment