Breaking News

13/07/2018

జేసీ వ్యాఖ్యలకు వామపక్షాల నిరసన

అనంతపురం, జూలై 13, (way2newstv.in)
ఎంపీ జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలుకు నిరసనగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కొంత ఉద్రిక్తత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కమ్యూనిస్టు పార్టీలు దొంగలంటూ తెదేపా పార్టీ అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వామపక్ష పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గుత్తి పట్టణంలో వామపక్ష పార్టీల ఆద్వర్యంలో జెసి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేశారు. దిష్టిబొమ్మ దహనానికి ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మను పోలీసులు లాగేసుకొవడంతో వామపక్ష పార్టీల నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెసి దివాకర్ రెడ్డి కి మతిబ్రమించిదని జెసి కమ్యూనిస్టులకు  బేషరతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



 జేసీ వ్యాఖ్యలకు వామపక్షాల నిరసన

No comments:

Post a Comment