న్యూఢిల్లీ జూలై 24 (way2newstv.in)
ఈపీఎఫ్ సభ్యుడు నెల రోజుల పాటు జాబ్ చేయకుండా ఉంటే.. తన పీఎఫ్ సొమ్ములో 75 శాతం విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని కార్మికశాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ సోమవారం లోక్సభలో వెల్లడించారు. జూన్ 26న జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ స్కీమ్ 1952లో కొత్తగా 68హెచ్హెచ్ పారాగ్రాఫ్ను చేర్చాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంగీకరించిందని ఆయన చెప్పారు. ఈ కొత్త పారాగ్రాఫ్ ప్రకారం.. ఓ ఈపీఎఫ్ మెంబర్ నెల రోజుల పాటు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉంటే.. తన మొత్తం సొమ్ములో 75 శాతం విత్డ్రా చేసుకునే వీలుంటుంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలు సమయంలో సంతోష్ గాంగ్వార్ తెలిపారు. రెండు నెలలపాటు ఉద్యోగం లేకుండా ఉంటే వంద శాతం పీఎఫ్ తీసుకునే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్ కల్పిస్తున్నది. అయితే పెళ్లి కోసం ఉద్యోగం మానేసిన మహిళా ఉద్యోగుల విషయంలో ఈ రెండు నెలల నిబంధన ఉండదు.
పీఎఫ్ సొమ్ములో 75 శాతం విత్డ్రా చేసుకునే అవకాశం
No comments:
Post a Comment