Breaking News

28/01/2020

మూడు కొత్త జిల్లాల దిశగా అడుగులు

విజయవాడ, జనవరి 28 (way2newstv.in)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. 13 జిల్లాలను లోక్ సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా.. కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా జిల్లా చేసినట్టు వార్తలొస్తున్నాయి.
మూడు కొత్త జిల్లాల దిశగా అడుగులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మచిలీపట్నం, అరకు, గురజాలల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుంది. వైద్య వసతులు తక్కువగా ఉండి వెనుకబాటుకు గురై, మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. అందుకయ్యే వ్యయంలో 60 శాతం వరకు నిధులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  సమకూర్చే అవకాశం ఉంది.ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం కోసమే మచిలీపట్నం, అరకు, గురజాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మూడు జిల్లాల ఏర్పాటుతోపాటు మిగతా కొత్త జిల్లాలను కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

No comments:

Post a Comment