న్యూ ఢిల్లీ జనవరి 11 (way2newstv.in)
జేఎన్యూలో హింసకు సంబంధించి వామపక్షాల ముసుగు తొలిగిపోయిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ‘వారే దుండగుల ముఠాకు నేతృత్వం వహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. యూనివర్సిటీని రాజకీయ రణరంగంగా మార్చారు’ అని ట్వీట్చేశారు. దేశ వినాశనాన్ని కోరుకున్నవారి పక్షాన నిలిచావంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్పై విమర్శలు గుప్పించారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకోన్పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ స్పంది స్తూ.. విద్యార్థులే ప్రధాన నిందితులు కావడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. సెమిస్ట్రర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన విద్యార్థులు వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. మరోవైపు వామపక్ష పార్టీలు తమ స్వార్థం కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్ విమర్శించారు.
No comments:
Post a Comment