Breaking News

20/01/2020

అపజయాల నుంచి విజయానికి సోపానం: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ జనవరి 20  (way2newstv.in)
అపజయాల నుంచి విజయానికి సోపానం అని ప్రధాని మోదీ అన్నారు.సాంకేతిక కారణాలతో విక్రమ్ ల్యాండర్ విఫలమైనదని తెలిసి ఆ రాత్రి తాను నిద్రపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో విద్యార్థులతో నిర్వహించిన పరీక్ష పే చర్చకార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-2 లాంచ్ మిషన్ ను వీక్షించేందుకు వెళ్లవద్దని తనకు పలువురు సూచించారని చెప్పారు.
అపజయాల నుంచి విజయానికి సోపానం: ప్రధాని మోదీ

ప్రయోగ ఫలితం ఎలా ఉండబోతోందో తెలియదని, విఫలమైతే ఏంటనేది మరో సందిగ్ధత అని కానీ, ఇస్రోను సందర్శించాలనే తాను అక్కడకు వెళ్లానని తెలిపారు.విక్రమ్ ల్యాండర్ ఇస్రో హెడ్ క్వార్టర్ తో సంబంధాలను కోల్పోయిందని శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత తాను ప్రశాంతంగా ఉండలేక పోయానని మరుసటి రోజు ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు.వారితో సమావేశం సందర్భంగా చంద్రయాన్-2 టీమ్ కృషిని అభినందించానని దీంతో, అందరి బాధ తొలగిపోయిందని చెప్పారు. అపజయాల నుంచి విజయాలను ఎలా సాధించాలో నేర్చుకోవచ్చని అన్నారు. రానున్న రోజుల్లో ఘన విజయాన్ని సాధించబోతున్నామని చెప్పారు.

No comments:

Post a Comment