Breaking News

06/12/2019

పసిడి ధర దిగొచ్చింది

ముంబై, డిసెంబర్ 6 (way2newstv.in)
ఫసిడి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గింది. దీంతో ధర రూ.39,770కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.170 పడిపోయింది. దీంతో ధర రూ.36,480కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా వెలవెలబోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా క్షీణించింది. కేజీ వెండి ధర రూ.100 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.47,400 పడిపోయింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది.
 పసిడి ధర దిగొచ్చింది

బంగారం ధర రూ.150 తగ్గింది. రూ.38,450కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 తగ్గుదలతో రూ.37,250కు క్షీణించింది. వెండి ధర రూ.100 తగ్గుదలతో కేజీకి రూ.47,400కు దిగొచ్చింది. విజయవాడ, విశాఖలో కూడా ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఈ రోజు పెరిగింది. ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 1,481.05 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం క్షీణతతో 17.02 డాలర్లకు తగ్గింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.ధారణంగా ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియోన్ కూడా డిసెంబర్ కల్లా చైనాతో తొలి విడత డీల్ ఓకే కావొచ్చని గతంలో తెలిపారు. దీంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డీల్ ఆలస్యం కావొచ్చని తెలిపారు. దీంతో మళ్లీ పసిడి ధరపై అనిశ్చితి నెలకొంది.అమెరికా ఫెడరల్ మరోవైపు వడ్డీ రేట్ల కోతకు సుముఖంగా లేకపోవడం కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతోంది. ఫెడ్ ఇప్పటికే వడ్డీ రేట్లును ఈ ఏడాది మూడుసార్లు తగ్గించేసింది. తదుపరి రేట్ల కోత ఉండదని సంకేతాలిచ్చింది. దీంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి డిమాండ్ పెరుగుతుందిమరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. వెండి ధర కూడా కేజీకి ఏకంగా రూ.50 వేల మార్క్‌కు ఎగసింది. అయితే మళ్లీ బంగారం ధర ఆ స్థాయికి వెళ్లలేదు.పసిడిపై వీటి ప్రభావంబంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment