Breaking News

03/12/2019

డౌన్ ట్రెండ్ లో గోల్డ్

ముంబై, డిసెంబర్ 3 (way2newstv.in)
పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.200 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,570కు తగ్గింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.190 క్షీణించింది. దీంతో ధర రూ.36,270కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది.బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం అక్కడే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.46,650 వద్ద కొనసాగుతోంది.
డౌన్ ట్రెండ్  లో గోల్డ్

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. బంగారం ధర రూ.150 పడిపోయింది. రూ.38,250కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 క్షీణతతో రూ.37,050కు పడిపోయింది. వెండి ధర స్థిరంగా కేజీకి రూ.46,650 వద్దనే ఉంది. విజయవాడ, విశాఖలో కూడా ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఈ రోజు తగ్గింది. ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 1,468.70 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 16.99 డాలర్లకు చేరింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియోన్ మాట్లాడుతూ.. డిసెంబర్ కల్లా చైనాతో తొలి విడత డీల్ ఓకే కావొచ్చని తెలిపారు. దీంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది.అమెరికా ఫెడరల్ మరోవైపు వడ్డీ రేట్ల కోతకు సుముఖంగా లేకపోవడం కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతోంది. ఫెడ్ ఇప్పటికే వడ్డీ రేట్లును ఈ ఏడాది మూడుసార్లు తగ్గించేసింది. తదుపరి రేట్ల కోత ఉండదని సంకేతాలిచ్చింది. దీంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. వెండి ధర కూడా కేజీకి ఏకంగా రూ.50 వేల మార్క్‌కు ఎగసింది. అయితే మళ్లీ బంగారం ధర ఆ స్థాయికి వెళ్లలేదు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment