Breaking News

13/12/2019

నాలుగు రోజుల తర్వాత పెరిగిన బంగారం

ముంబై, డిసెంబర్ 13 (way2newstv.in)
పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.180 పెరిగింది. దీంతో ధర రూ.39,350కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.180 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.36,090కు చేరింది. ఇకపోతే బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.750 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.46,650కు తగ్గింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. 
నాలుగు రోజుల తర్వాత పెరిగిన బంగారం

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.38,050కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.36,850కు చేరింది. పసిడి పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. ధర కేజీకి రూ.750 తగ్గుదలతో రూ.46,650కు తగ్గింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 1,470.65 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 16.95 డాలర్లకు ఎగసింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చాయి. డిసెంబర్ 15 నుంచి చైనా దిగుమతులపై అమెరికా కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈలోపు డీల్ ఓకే కావొచ్చని అందరూ భావిస్తున్నారు. అందుకే బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. లేదంటే పసిడి పరుగు తప్పదు.బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గురువారం రోజున నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1490 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.అంతర్జాతీయ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. ఫెడ్ రెండు రోజుల మీటింగ్ అనంతరం రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్న ప్రకటించింది. దీంతో పసిడిపై కొంత మేర సానుకూల ప్రభావం పడింది. అందుకే ధర పైకి కదిలింది. ఇప్పుడు ఫెడ్ రేటు 1.5 శాతం నుంచి 1.75 శాతం మధ్యలో ఉంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment