Breaking News

02/11/2019

ఎంపీ సంజయ్ పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనకు నిరసంగా బీజేపీ ఆందోళన

జగిత్యాల నవంబర్ 02,(way2newstv.in):
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పట్ల పోలీసులు అనుచిత ప్రవర్తనకు నిరసనగా జిల్లా కేంద్రంలో శనివారం నాడు బీజేపీ నేతల ఆందోళన కార్యక్రమంను నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 
ఎంపీ సంజయ్ పట్ల  పోలీసుల అనుచిత  ప్రవర్తనకు నిరసంగా  బీజేపీ ఆందోళన

వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించిగా చాకచక్యంగా ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి , కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.ఇంచార్జి కరీంనగర్ ఏసీపీ తో పాటు ఇతర అధికారులను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తు ఆర్డిఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళన లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment