Breaking News

21/11/2019

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ నవంబర్ 21 (way2newstv.in):
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని..కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. 
ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి వినతిపై స్పందించిన గడ్కరీ.. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ రవాణా శాఖ మంత్రి, అధికారులతో మాట్లాడతానన్నారు. ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని విడిచిపెట్టాలని, ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని గడ్కరీ అన్నారు

No comments:

Post a Comment