Breaking News

30/10/2019

మళ్లీ తగ్గిన బంగారం ధర

ముంబై, అక్టోబర్ 30  (way2newstv.in)
పసిడి ధర మరోసారి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,880కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.320 క్షీణించింది. దీంతో ధర రూ.36,530కు దిగొచ్చింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.400 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు దిగొచ్చింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గింది. దీంతో ధర రూ.38,500కు దిగొచ్చింది. 
మళ్లీ తగ్గిన బంగారం ధర

అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గుదలతో రూ.37,300కు క్షీణించింది.బంగారం ధర పడిపోతే.. కేజీ వెండి ధర కూడా పతనమైంది. రూ.400 క్షీణతతో రూ.48,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 1,491 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం క్షీణతతో 17.81 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment