Breaking News

30/10/2019

జాతీయ జెండాలో వైసీపీ రంగులు

అనంతపురం, అక్టోబర్ 30  (way2newstv.in)
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల భవనాలను అధికార పార్టీ రంగుల్లోకి మార్చేస్తున్నారు. చివరికి శ్మశానాలనూ వదలకుండా వైఎస్సార్సీపీ రంగులు వేసేశారు. పంచాయతీ కార్యలయాలకు రంగులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామ సచివాలయానికి వైఎస్సార్సీపీ రంగులు వేస్తున్న వీడియో వైరల్ అయింది. సచివాలయ గోడపై ఉన్న జాతీయ జెండాను సైతం వదలకుండా పార్టీ రంగుల్లో ముంచెత్తడమే కారణం. 
జాతీయ జెండాలో  వైసీపీ రంగులు

జాతీయ జెండా పెయింటింగ్‌పై అధికార పార్టీ రంగులు వేయించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదేనా మీ దేశభక్తి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. తాజా ఘటన వైఎస్సార్సీపీ నేతల దేశభక్తికి.. జాతీయ పతాకం పట్ల వారికున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోందని విమర్శించారు. జాతీయ పతాకానికి కూడా సిగ్గులేకుండా పార్టీ రంగులు వేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పంచాయతీ కార్యాలయాల నుంచి శ్మశానాల వరకూ వేటినీ వదలడం లేదని, అన్నింటికీ పార్టీ రంగులు వేస్తున్నారని లోకేష్ విమర్శలు గుప్పించారు. రేపు జాతీయ జెండాకు బదులు వైఎస్సార్సీపీ జెండాను ఎగరవేస్తారేమోనంటూ సెటైర్లు వేశారు. అధికార పార్టీ నాయకులు కనీసం జాతీయ జెండానైనా గౌరవించాలని హితవు పలికారు

No comments:

Post a Comment