Breaking News

31/10/2019

పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకురాలు ఇందిరాగాంధీ

ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి
ఘనంగా ఇందిరాగాంధీ 35వ వర్ధంతి
జగిత్యాల  అక్టోబర్ 31(way2newstv.in):
దేశంలో పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకురాలు ఇందిరాగాంధీ ఆని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆన్నారు.   పట్టణంలో గురువారం  దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ లోని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయ లక్ష్మీపూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకురాలు ఇందిరాగాంధీ

ఆనంతరం ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిమాట్లాడుతూ దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారని, పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకురాలని,దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మహోన్నత నాయకురాలు ఇందిరా గాంధీ కొనియాడారు.ఈ కార్యక్రమంలో తాటిపర్తి దేవేందర్ రెడ్డి,బండ శంకర్,గంగం మహేష్,గుంటి జగదీశ్వర్,చిట్ల అంజన్న, బింగి రవి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment