Breaking News

25/10/2019

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ముంబై, అక్టోబర్ 25 (way2newstv.in)
పసిడి ధర మళ్లీ పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.39,970కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.36,640కు చేరింది. పసిడి ధర ధర పెరిగితే.. వెండి ధర భారీగా పరుగులు పెట్టింది. ఏకంగా రూ.670 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,770కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. 
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ధరలో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,600 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో ధర రూ.37,400 వద్దనే కొనసాగుతోంది.బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. కేజీ వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ.670 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,770కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం క్షీణతతో 1,504.35 డాలర్లకు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment